- ఆర్సీబీ క్రికెటర్లు జంపా, కేన్ రిచర్డ్సన్ ఇంటికి
- ఇక్కడి పరిస్థితులపై కంగారూ ప్లేయర్ల ఆందోళన
- టోర్నీ కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం
న్యూఢిల్లీ: సాఫీగా సాగుతున్న ఐపీఎల్–14లో సోమవారం ఒక్కసారిగా కలకలం రేగింది. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తోపాటు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్లీగ్నుంచి తప్పుకున్నారు. దీంతో మిగిలిస సీజన్ సక్రమంగా జరగడంపై సందేహాలు మొదలయ్యాయి. కానీ ఎంతమంది ప్లేయర్లు లీగ్కు దూరంగా ఉన్నా సరే..టోర్నీ అనుకున్న ప్రకారం జరుగుతుందని బీసీసీఐ తేల్చిచెప్పింది. అశ్విన్ ఐపీఎల్–14లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. అయితే, తన ఫ్యామిలీ, బంధువులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారని, వారికి సపోర్ట్గా ఉండేందుకు ఇంటికి వెళ్తున్నట్టు ఆదివారం సన్రైజర్స్తో మ్యాచ్ ముగిసి న వెంటనే అశ్విన్ ట్వీట్ చేశాడు. పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి లీగ్లో బరిలోకి దిగుతానని చెప్పాడు. అశ్విన్ ఫ్యామిలీలో ఒకరికి కరోనా సోకినట్టు సమాచారం. కాగా, రాయల్చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ పర్సనల్ రీజన్స్తో లీగ్నుంచి విత్ డ్రా అయ్యారు. జంపాను రూ.1.5 కోట్లుకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. రిచర్డ్సన్ కోసం రూ.4 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ సీజన్లో రిచర్డ్సన్ ఒక మ్యాచ్లో బరిలోకి దిగాడు. జంపాకు అవకాశం రాలేదు. ఇద్దరు ఆసీస్ తిరిగి వెళ్లారు. కాగా, రాజస్తాన్ రాయల్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆండ్రూ టై ఆదివారమే జట్టును వీడాడు. ఇండియాలో పరిస్థితులు అదుపు తప్పాయని, ఇలాగే కొనసాగితే ఇప్పట్లో తిరిగి ఇంటికి వెళ్లమనే లీగ్ను వీడుతున్నట్టు టై చెప్పాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఫారిన్ క్రికెటర్లు తప్పుకుంటున్నా లీగ్కు వచ్చిన ముప్పు ఏమీ లేదని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. లీగ్ను విడిచి వెళ్లాలనుకుంటే అది ప్లేయర్ల ఇష్టమన్నారు.
మా ప్లేయర్లు టెన్షన్ పడుతున్నారు: హస్సీ
ఇండియాలో పరిస్థితిని చూసి లీగ్లో ఉన్న ఆసీస్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్సీ అన్నాడు. ‘తిరిగి ఆస్ట్రేలియా వెళ్లగలమా లేదా అని ప్లేయర్లంతా టెన్షన్లో ఉన్నారు. లీగ్లో మిగిలిన ఆసీస్ క్రికెటర్లలో మరికొందరు కూడా స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నారు’ అని ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీ తెలిపాడు. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి వెళ్లడం కంటే బయో బబుల్లో ఉండటమే సేఫ్ అని ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ పేసర్ కూల్టర్నైల్ అన్నాడు. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ అంశంపై స్పందించాడు. ‘ఐపీఎల్ బయోబబుల్ అవతల పరిస్థితులపై అవగాహన ఉంది. కానీ లీగ్ కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు. మరోవైపు ప్లేయర్లతోపాటు తమ దేశానికి చెందిన కామెంటేటర్స్తో నిరంతరం టచ్లో ఉంటున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ సోమవారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఐపీఎల్లో ప్రస్తుతం 14 మంది ఆస్ట్రేలియన్లు మిగిలారు. వార్నర్, స్మిత్, కమిన్స్, కోచ్లు పాంటింగ్, సైమన్ కటిచ్తోపాటు పలువురు లీగ్లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్ లీగ్ నుంచి కాస్త ముందుగానే స్వదేశానికి వెళ్లనున్నారు. క్వారంటైన్ రూల్స్ నేపథ్యంలో వీళ్లు లీగ్ చివరి దశలో ఐపీఎల్బబుల్ను వీడనున్నారు.