ఆస్తులు ‑ అప్పుల తేడాపై జాగ్రత్త : ఆర్​బీఐ గవర్నర్

ఆస్తులు ‑ అప్పుల తేడాపై జాగ్రత్త : ఆర్​బీఐ గవర్నర్

బ్యాంకులకు దాస్ సూచన​

ముంబై : ఆస్తులు–అప్పుల మధ్య వ్యత్యాసం ఎక్కువవుతుంటే జాగ్రత్తపడాల్సిందిగా  బ్యాంకులను ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ శుక్రవారం హెచ్చరించారు. ఆస్తులు ఎక్కువైనా, అప్పులు ఎక్కువైనా ఫైనాన్షియల్​ స్టెబిలిటీకి ఇబ్బందికరమేనని ఆయన చెప్పారు. అమెరికాలోని తాజా బ్యాంకింగ్​ సంక్షోభానికి ఇదే కారణమని పరోక్షంగా పేర్కొన్నారు.

శక్తికాంత దాస్​ కొచ్చిలో  ఫెడరల్​ బ్యాంక్​ ఫౌండర్​ కే పీ హోర్మిస్​ యాన్యువల్​ మెమోరియల్​ ఉపన్యాసం చేశారు. మన ఫైనాన్షియల్​ సెక్టార్​ నిలకడగానే ఉందని, ఇన్​ఫ్లేషన్​ భయాలు తగ్గినట్లేనని కూడా దాస్​ చెప్పారు.