ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ మంగళవారం మొదలైంది. గురువారం నాడు పాలసీ రేటు నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ వెల్లడిస్తారు. ఇన్ఫ్లేషన్ దిగిరావడంతో, గ్రోత్కి ఊతమిచ్చేలా రెపో రేటును ఈసారి మార్చకుండా 6.5 శాతం వద్దే కొనసాగిస్తారని మార్కెట్ అంచనా వేస్తోంది.
ఎంపీసీ మీటింగ్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాయకత్వంలో జరుగుతుండగా, ఆరుగురు మెంబర్లు పాల్గొంటున్నారు. ఏప్రిల్ నెలలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ 4.7 శాతానికి దిగిపోయింది. మే నెలలో ఇది మరింత తగ్గే ఛాన్స్ ఉందని శక్తికాంత దాస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలిపారు. మే నెల ఇన్ఫ్లేషన్ గణాంకాలను ఈ నెల 12 న ప్రకటించనున్నారు.