- ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్
వెలుగు బిజినెస్ డెస్క్: అప్పులిచ్చే యాప్స్ను కట్టడి చేయాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కమిటీ సూచించింది. వాటి పూర్తి వివరాలు వెరిఫై చేసేందుకు ఒక నోడల్ ఏజన్సీ, ఇల్లీగల్ లెండింగ్ ఆపేందుకు తగిన చట్టం తేవాలని అభిప్రాయపడింది. మొబైల్ యాప్స్ ద్వారా అప్పులిస్తూ కస్టమర్లను వేధింపులకు గురి చేయడాన్ని అరికట్టేందుకు ఈ చర్యలని పేర్కొంది. ఫిన్టెక్ రంగంలో ఇనొవేషన్ను ఎంకరేజ్ చేస్తూనే, అక్రమాలకు పాల్పడకుండా తగిన పద్ధతులు తేవాలని తెలిపింది.
డిజిటల్గా అప్పులిచ్చే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, మొబైల్ యాప్స్ కార్యకలాపాలను స్టడీ చేసేందుకు ఆర్బీఐ ఈ వర్కింగ్ గ్రూప్ను నియమించింది. ఈ ఏడాది జనవరిలో ఏర్పాటయిన వర్కింగ్ గ్రూప్కు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దాస్ నాయకత్వం వహించారు. ఇచ్చిన అప్పుల వసూళ్లకు బలవంతపు చర్యలకు డిజిటల్ లెండింగ్ కంపెనీలు దిగుతున్నాయనే ఆరోపణలు రావడంతో వర్కింగ్ గ్రూప్ను నియమించారు. మొబైల్ యాప్స్ కంపెనీల టెక్నలాజికల్ క్రెడెన్షియల్స్ను, వాటికి అప్పులిస్తున్న కంపెనీలను, సర్వీస్ ప్రొవైడర్లను వెరిఫై చేసేందుకు ఒక నోడల్ ఏజన్సీ ఉండాలని ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ తేల్చింది. తాము వెరిఫై చేసిన మొబైల్ యాప్స్ వివరాలను వెబ్సైట్లోనూ ఆ నోడల్ ఏజన్సీ ఉంచాలని సూచించింది. మన దేశంలోని యాండ్రాయిడ్ యూజర్లకు అప్పులిచ్చే మొబైల్ యాప్స్ ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య కాలంలో 1,100 దాకా ఉన్నట్లు వర్కింగ్ గ్రూప్ లెక్కకట్టింది. ఇందులో 600 యాప్స్ ఇల్లీగలేనని తేల్చింది. బాలెన్స్ షీట్ లెండింగ్ను కట్టడి చేసేందుకు కూడా తగిన రెగ్యులేషన్ ఉండాలని వర్కింగ్ గ్రూప్ వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలు లేదా వేరే ఏదైనా కంపెనీల నుంచి డబ్బును తెచ్చుకుని, ఆ డబ్బును కస్టమర్లకు మొబైల్ యాప్స్ అప్పులుగా ఇస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరికి ఎలా డబ్బులు వెళ్తున్నాయనేది తెలియడం లేదని వర్కింగ్ గ్రూప్ పేర్కొంది. కాబట్టి అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ జరగకుండా చూసేందుకు ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని కోరింది.