- ఆగస్టు 5 వరకు చదవాలన్న ప్రజ్ఞ సింగ్
భోపాల్: ఆగస్టు 5 వరకు ప్రతి రోజు ఐదు సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా వైరస్ తగ్గిపోతుందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ పిలుపునిచ్చారు. కరోనా నుంచి విముక్తి పొందేందుకు అందరం కలిసి ఆధ్యాత్మిక బాటలో పయనిద్దామని ఆమె ట్వీట్ చేశారు. జులై 25 నుంచి ఆగస్టు 5 వరకు ప్రతి ఒక్కరు ఇంట్లో ఐదుసార్లు హనుమాన్ చాలీసా పఠించాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో భూమి పూజ జరిగిన తర్వాత అందరం ఇళ్లలో దీపాలు వెలగించి హనుమాన్ చాలీసాను ముగ్గిద్దామని చెప్పారు. మధ్యప్రదేశ్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆమె అన్నారు. ఈ మేరకు ఒక వీడియోను ట్వీట్ చేశారు. భోపాల్లో ఆగస్టు 4 వరకు లాక్డౌన్ ఉందని, ఆ తర్వాతి రోజు భూమి పూజను దీపావళిలా సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నారు. దేశం మొత్తం ఒక్కసారిగా హనుమాన్ చాలీసా చదవడం వల్ల కరోనా వైరస్ పారిపోతుందని, ఇది రాముడికి మనం చేసే ప్రార్థన అని ప్రగ్యా అన్నారు.