వికారాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యతని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. 35వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆర్టీఏ, ఆర్టీసీ, పోలీస్ అధికారులు, వికారాబాద్ పట్టణంలోని కాలేజీ, స్కూల్ స్టూడెంట్లు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎంఆర్పీ పెట్రోల్ బంక్ వరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సుమారు గంటకు 400 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. స్కూల్స్, కాలేజీల్లో స్టూడెంట్లకు రోడ్డు ప్రమాదాలు, రవాణా , మైనర్ డ్రైవింగ్ విషయాలపై టీచర్లు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్, ఆర్టీఏ అధికారి జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి
చేవెళ్ల: ట్రాఫిక్ రూల్స్ను ప్రతి ఒక్కరూ పాటించాలని చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సైదులు అన్నారు.రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం శంకర్పల్లి టౌన్లో స్కూల్ స్టూడెంట్లతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సైదులు మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్ కారణంగానే ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. మైనర్లకు వెహికల్స్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
శంషాబాద్లో..
శంషాబాద్: రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా శంషాబాద్ లోని స్కూల్ స్టూడెంట్లతో కలిసి ట్రాఫిక్ పోలీసులు 2కే రన్ నిర్వహించారు. 150 మందికి పైగా స్టూడెంట్లు పాల్గొన్నారు.