ట్రిపుల్​ ఆర్​ బాధితుల ఆందోళన

ట్రిపుల్​ ఆర్​ బాధితుల ఆందోళన

యాదాద్రి : రీజినల్​ రింగ్​ రోడ్డు అలైన్​మెంట్ తిరిగి మార్చాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రి జిల్లా రాయగిరి బాధితులు ఆందోళన బాటపట్టారు. బ్యానర్లు, ప్లకార్డులతో నినాదాలు చేస్తూ యాదాద్రి కలెక్టరేట్​లోకి దూసుకొచ్చారు. గ్రీవెన్స్​లో  కలెక్టర్​ పమేలా సత్పతిని చట్టుముట్టి ​ భైఠాయించారు. రీజినల్​ రింగ్​ రోడ్డు అలైన్​మెంట్​ మారుస్తూ ఆగస్టు 23న గెజిట్ నోటిఫికేషన్​ విడుదల చేశారు. మారిన అలైన్​మెంట్​తో భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలోనే దాదాపు 71 మంది రైతులకు సంబంధించిన 242.10 ఎకరాలను సేకరించాల్సిఉంటుంది.  మారిన అలైన్​మెంట్​ కారణంగా తమకు అన్యాయం జరుగుతోందని రాయగిరి రైతు  కుటుంబాలు రోడ్డెక్కాయి.  

కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో పోలీసులు అడ్డుకుంటున్నా వినకుండా  గ్రీవెన్స్​  హాలులోకి దూసుకెళ్లారు. కొంతమందికోసం మొదటి అలైన్​మెంట్​మార్చి మా భూములు లాక్కుంటారా.? అంటూ ప్రశ్నించారు.  పంటలు పండించుకుంటున్న భూములను  లాక్కుంటే మేమేలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని ఇది తమ పరిధిలో లేని అంశమని,  అలైన్​మెంట్​ విషయంలో వెంటనే ప్రభుత్వానికి లెటర్​ రాస్తామని హామీ ఇచ్చారు.  దీంతో రైతులు ఆందోళన 
విరమించారు.