బద్వేలు ఉప ఎన్నిక నామినేషన్లలో 9 తిరస్కరణ

బద్వేలు ఉప ఎన్నిక నామినేషన్లలో 9 తిరస్కరణ

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు ఈ నెల 30న  రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇవాళ(సోమవారం) అధికారులు నామినేషన్లు పరిశీలించారు. బద్వేలు ఉప ఎన్నిక కోసం 27 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. పరిశీలనలో 9 మంది అనర్హులుగా తేలారు. వారి నామినేషన్ పేపర్లను తిరస్కరించారు. ప్రస్తుతం బద్వేలు బరిలో 18 మంది మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13 వరకు గడువు ఉంది.

YCP సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య  చనిపోవడంతో బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఆనవాయితీ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. దీంతో టీడీపీ, జనసేన పోటీ చేయరాదని నిర్ణయించుకోగా..బీజేపీ పనతల సురేశ్ ను తమ అభ్యర్థిగా బరిలో దించింది.