న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంటర్టైన్ బిజినెస్, డిస్నీ హాట్స్టార్ల విలీనం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూర్తి కానుంది. ఈ డీల్కు సంబంధించి కిందటి వారం నాన్ బైండింగ్ అగ్రిమెంట్ కుదిరిందని రిపోర్ట్స్ వెలువడ్డాయి. ఈ రెండు కంపెనీల విలీనంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. చివరికి విలీన సంస్థలో రిలయన్స్కు మెజార్టీ వాటా దక్కనుందని తెలిసింది.
రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 స్టెప్డౌన్ సబ్సిడరీని ఏర్పాటు చేసి స్టార్ ఇండియాను విలీనం చేసుకుంటుంది. ఈ విలీన సంస్థలో 51 శాతం వాటా రిలయన్స్కు, 49 శాతం వాటా డిస్నీ స్టార్కు దక్కుతుంది. ఈ డీల్లో జియో సినిమా కూడా భాగం కానుంది. ఈ డీల్ పూర్తయితే డిస్నీ ఓటీటీ యాప్, హాట్సార్ట్ యూజర్లు మరింత పెరుగుతారు.