గిగా ఫైబర్ నెట్ ను ప్రారంభించనున్న జియో

గిగా ఫైబర్ నెట్ ను ప్రారంభించనున్న జియో

టెలికాం రంగంలో ఇప్పటికే సంచలనం సృష్టించిన జియో… తాజాగా మరో చరిత్ర సృష్టించబోతోంది. కేవలం రూ. 600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 12వ తేదీన జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించబోతోంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1GBPS స్పీడ్ తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. OST డివైస్ కోసం రూ. 4,500 చెల్లించాల్సి ఉంటుంది. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తన్ని వెనక్కి ఇచ్చేస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి.