హైకోర్టు తీర్పుపై సుప్రీంకు రిలయన్స్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు రిలయన్స్

న్యూఢిల్లీ: తాము కేజీ బేసిన్​లోని ఓఎన్​జీసీ బేసిన్ నుంచి అక్రమంగా గ్యాస్​ను తీశామని, ఇందుకు పరిహారం చెల్లించాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ రిలయన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీలోని కేజీ బేసిన్​ నుంచి రిలయన్స్​, దీని కన్సార్టియం పార్ట్​నర్స్​ గ్యాస్​తీసినందుకు  రూ.12,500 కోట్లు చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ విషయమై సింగపూర్​కు చెందిన ఆర్బిట్రేటర్ ​లారెన్స్​ బూ నాయకత్వంలోని ముగ్గురు సభ్యులు ట్రిబ్యునల్​పై తీర్పు చెప్పిందని, ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు లేదని 
రిలయన్స్​ వాదించింది.