
సినీ ఇండస్ట్రీకి దూరమైన రేణూ దేశాయ్..ఇటీవల ఓ టీవీ షోతో తెలుగు ప్రజలను పలకరించారు. అంతేకాదు త్వరలో సిల్వర్ స్క్రీ న్ పై కూడా రీ ఎంట్రి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న బయోగ్రాఫికల్ మూవీ తో రేణూ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దొంగాట ఫేం వంశీ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టూవర్ట్పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో బద్రి సినిమాతో టాలీవుడ్ పరిచయం అయిన రేణూ దేశాయ్…మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత పవన్ను వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. పవన్ నుంచి విడిపోయిన తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమయ్యారు.