
కామారెడ్డి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్చట్టబద్ధత కోసం ఈనెల 18న తలపెట్టిన బంద్ను జిల్లాలో సక్సెస్ చేయాలని బీసీ సంఘాల ఐక్య కార్యచరణ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌజ్లో నిర్వహించిన మీటింగ్లో ప్రతినిధులు మాట్లాడారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్పాటించాలన్నారు.
అంతకు ముందు బీసీ సంఘాల ప్రతినిధులు చాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణ వర్తక సంఘం, తదితర సంఘాల ప్రతినిధులను కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. మీటింగ్లో బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు ఎస్సీ, ఎస్టీ, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంజీ వేణుగోపాల్గౌడ్, సాప శివరాములు, కుంబాల రవి, జగదీశ్యాదవ్, అరికల ప్రభాకర్, గరిగంటి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్గౌడ్, నాగరాజు, లక్ష్మణ్, మల్లయ్య, సిద్ధిరాములు పాల్గొన్నారు.
నిజామాబాద్ పట్టణంలో..
నిజామాబాద్అర్బన్ : బీసీ బంద్కు సబ్బండ వర్ణాలు మద్దతు తెలుపుతున్నాయి. గురువారం నిజామాబాద్లోని గీతాభవన్లో అన్ని పార్టీల లీడర్లతో పాటు పలు సంఘాలు రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీలు, కుల, ప్రజా, డాక్టర్లు, లాయర్లు, మహిళా, రైతు, గంజ్వర్తక, బంగారు, వెండి వర్తక, కిరాణ వర్తక సంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ బొబ్బిలి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
బంద్కు బీఎస్పీ మద్దతు..
బోధన్, వెలుగు : బీసీ బంద్కు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు నీరడి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు సింగడే పాండి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరివేను సంతోష్ తెలిపారు. గురువారం విలేకరులతో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల అమలుతో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. రాజ్యంగంలోని 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్చేర్చాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ బోధన్ అసెంబ్లీ ఇన్చార్జి నీరడి రవి, అసెంబ్లీ అధ్యక్షుడు రమేశ్దాస్, సాలూర మండల అధ్యక్షుడు వాగమారే జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ (ప్రజాపంథా) మద్దతు..
బీసీ బంద్కు సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ (ప్రజాపంథా) పార్టీ మద్దతు ఇస్తుందని డివిజన్ కార్యదర్శి ప్రెస్మీట్ లో తెలిపారు. జీవో నెంబర్ 9 ఆర్డినెన్స్ పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడం సరికాదన్నారు. సమావేశంలో బోధన్ పట్టణ నాయకులు ఇర్షాద్ భాయ్, డి.పోశెట్టి, పి. ప్రవీణ్, ఆజాం, పోశెట్టి, బి. నాగమణి, బీపాషా బేగం పాల్గొన్నారు.