![కృత్రిమశ్వాస అందించిన రెస్క్యూ సిబ్బంది](https://static.v6velugu.com/uploads/2024/02/rescue-personnel-provided-artificial-respiration_eMlGOnC6cJ.jpg)
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఓ భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లయ్యగిరి రాజు అనే వ్యక్తి అమ్మవార్ల దర్శనం కోసం ఉదయం నుంచి జాతర క్యూ లైన్లో నిల్చున్నాడు. అయితే ఎండ వేడికి అలిసిపోవడంతో ఛాతిలో నొప్పితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే రెస్క్యూ సిబ్బంది గమనించి అతడికి కృత్రిమ శ్వాసం అందించారు. చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే భారీగా భక్తులు క్యూలైన్లోకి చేరడంతో ఊపిరి ఆడక పలువురు శ్వాస తీపుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.