బచ్చన్నపేటలో రిటైర్డ్​ ఎంపీడీవో​ కిడ్నాప్?

బచ్చన్నపేటలో రిటైర్డ్​ ఎంపీడీవో​ కిడ్నాప్?
  • పోచన్నపేట శివారులో బైక్​
  • వెతుకుతున్న పోలీసులు

బచ్చన్నపేట,వెలుగు : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో రిటైర్డ్​ఎంపీడీవో నల్ల రామకిష్టయ్యను కిడ్నాప్​ చేశారని అతడి కుటుంబసభ్యులు డయల్​1‌‌‌‌‌‌‌‌00 కు కాల్​చేసి చెప్పారు. పోచన్నపేటకు చెందిన నల్ల రామకిష్టయ్య ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఎంపీడీవోగా పనిచేసి పదేండ్ల కింద రిటైర్​అయ్యారు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్నారు.

గురువారం సాయంత్రం ఇంట్లోంచి వెళ్లిన రామకిష్టయ్య చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వెతకగా అతడి బైక్​ గ్రామ శివారులోని ఓ మామిడితోట వద్ద మెయిన్​ రోడ్డు పక్కన కనిపించింది. దీంతో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేసి ఉంటారని భావించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిసర​ప్రాంతాల్లోని  సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఎస్సై నవీన్​కుమార్ ​చెప్పారు. రామకిష్టయ్య ఎక్కడైనా కనిపిస్తే ఆచూకీ ఇవ్వాలని కోరారు.