- పోచన్నపేట శివారులో బైక్
- వెతుకుతున్న పోలీసులు
బచ్చన్నపేట,వెలుగు : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేటలో రిటైర్డ్ఎంపీడీవో నల్ల రామకిష్టయ్యను కిడ్నాప్ చేశారని అతడి కుటుంబసభ్యులు డయల్100 కు కాల్చేసి చెప్పారు. పోచన్నపేటకు చెందిన నల్ల రామకిష్టయ్య ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఎంపీడీవోగా పనిచేసి పదేండ్ల కింద రిటైర్అయ్యారు. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటున్నారు.
గురువారం సాయంత్రం ఇంట్లోంచి వెళ్లిన రామకిష్టయ్య చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వెతకగా అతడి బైక్ గ్రామ శివారులోని ఓ మామిడితోట వద్ద మెయిన్ రోడ్డు పక్కన కనిపించింది. దీంతో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని భావించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిసరప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ చెప్పారు. రామకిష్టయ్య ఎక్కడైనా కనిపిస్తే ఆచూకీ ఇవ్వాలని కోరారు.