నంది అవార్డుల పేరును..గద్దర్ అవార్డులుగా మారుస్తాం : రేవంత్ రెడ్డి

నంది అవార్డుల పేరును..గద్దర్ అవార్డులుగా మారుస్తాం : రేవంత్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాగానే నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా.. గద్దర్ అవార్డుల పేరుతో నందులను బహుకరిస్తామన్నారు. అంతేకాదు.. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు, కళాకారులకు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని తెలిపారు. గద్దర్ తెలంగాణ ప్రైడ్ , లెజెండ్ అని పొగడ్తల వర్షం కురిపించారు. అవసరమైతే ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం పెడుతామన్నారు. 

గద్దర్ బతికి ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది.  ఇస్తోంది. కూడా. గద్దర్ మరణం తర్వాత ఆయన పార్థిదేహాన్ని ఎల్బీ స్టేడియంలోకి తరలించి.. ప్రజల సందర్శనార్థం ఉంచడంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ లాంఛనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియలకు ముందు సీఎం కేసీఆర్ గద్దర్ పార్థివదేహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటు రేవంత్ రెడ్డి, సీతక్క వంటి నాయకులు దగ్గరుండి గద్దర్ అంత్యక్రియలను పర్యవేక్షించారు.