రామాయంపేట సూసైడ్ ఘటనలో మృతుల కుటుంబానికి దైర్యం చెప్పారు కాంగ్రెస్ నేతలు. నిన్న కామారెడ్డిలో తల్లీకొడుకులు పద్మ, సంతోష్ లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. TRS నేతల ఆగడాలు మితిమీరిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు రేవంత్ రెడ్డి.
మరిన్ని వార్తల కోసం