
- ప్లాంట్ రన్ అయ్యేందుకు మరో పది రోజులు పట్టే చాన్స్
- సాంకేతిక లోపాలతో ఖరీఫ్ సీజన్ లో పలుమార్లు షట్ డౌన్
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్అండ్ కెమికల్స్లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్ లో యూరియా తయారీ ఇంకా లేట్ అయ్యేలా ఉంది. గత ఆగస్టు14న ప్లాంట్లోని హెచ్టీఆర్మెషీన్ లో టెక్నికల్ప్రాబ్లమ్ తలెత్తింది. 37 రోజులుగా రిపేర్లు చేస్తున్నా ఇంకా కంప్లీట్ కాలేదు. డెన్మార్క్ నుంచి వచ్చిన టెక్నికల్ టీమ్ తో పాటు ఎల్అండ్టీ టీమ్ రిపేర్ చేస్తోంది. ప్లాంట్రన్ చేయడానికి ఇంకా పది రోజులు పట్టనున్నట్టు తెలుస్తోంది.
2021, మార్చి 22న ప్లాంట్ లో యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటివరకు 20 సార్లు టెక్నికల్ ప్రాబమ్స్ తలెత్తాయి. గత మే 8 నుంచి జూన్15 వరకు 39 రోజులు, జులై 16 నుంచి ఆగస్టు 4 వరకు 20 రోజులు ప్లాంట్షట్డౌన్అయింది. ప్రస్తుతం ప్లాంట్లో అమ్మోనియా లీక్కావడంతో షట్డౌన్చేశారు. గత ఆగస్టు 14 నుంచి 37 రోజులుగా ప్లాంట్ షట్ డౌన్లోనే ఉంది.
హెచ్ టీఆర్ మెషీన్ ముంబైకి..
ప్లాంట్లో యూరియా ఉత్పత్తి ప్రక్రియలో సింథసిస్గ్యాస్ప్రొడ్యూస్చేసేందుకు ఏర్పాటు చేసిన హీట్ట్రాన్స్ఫార్మింగ్రీఫార్మర్(హెచ్ టీఆర్)లో గత ఆగస్టు 14న టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. కంపెనీలో 11.70 శాతం వాటా కలిగిన డెన్మార్క్కు చెందిన హల్దర్టాప్స్కంపెనీ హెచ్టీఆర్మెషీన్ ను ఏర్పాటు చేసింది.
ప్లాంట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ రాగానే వెంటనే హల్దర్ కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించగా వచ్చారు. ఎల్అండ్టీ సంస్థ అధికారులతో కలిసి రిపేర్లు చేపట్టారు. ప్లాంట్లోని ఒక పార్ట్ను రిపేర్కోసం పది రోజుల కింద ప్రత్యేక ట్రక్లో ముంబైకి తీసుకెళ్లారు. అది వచ్చిన తర్వాతే రిపేర్లు చేపట్టి ప్లాంట్ను రన్ చేసే చాన్స్ ఉంది.
రబీ సీజన్కైనా అందించేనా..?
ప్రస్తుతం ప్లాంట్షట్డౌన్కారణంగా ఖరీఫ్ సీజన్ లో యూరియా ఉత్పత్తి చేయలేకపోయింది. జూన్నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ప్లాంట్షట్డౌన్అయింది. దీంతో సుమారు 4.24 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్ లో తయారయ్యే యూరియాలో తెలంగాణకే సగానికి పైగా కేటాయింపులు చేసేవారు. ఇప్పుడు యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో కొరత ఏర్పడింది. కాగా.. అక్టోబర్నుంచి మొదలయ్యే రబీ సీజన్కైనా యూరియా అందుతుందా ? అనే సస్పెన్స్ నెలకొంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి
ఇకముందైనా ప్లాంట్నిర్వహణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్లాంట్లో నిత్యం టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. మరోవైపు సెంట్రల్ ఆఫీసును నోయిడా నుంచి రామగుండం తరలించాలనే డిమాండ్వినిపిస్తోంది. ఇలా ఎందుకంటే.. ప్లాంట్ లో ఏదైనా సమస్య తలెత్తితే.. ఉన్నతాధికారు లు త్వరగా స్పందించేందుకు ఆస్కారం ఉంటుంది. తెలంగాణకు యూరియాను అందించే ప్లాంట్పై 11 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్పెట్టాలి.