రేపటి (జూలై 7)నుంచి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్ షురూ : బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

రేపటి (జూలై 7)నుంచి ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్ షురూ : బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్

బాసర, వెలుగు : బాసర, మహబూబ్​నగర్ లోని ఆర్జీయూకేటీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభమవుతుండగా.. శనివారం బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.  ఇబ్బందులు రాకుండా  హెల్ప్ డెస్క్​ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్  కు  20 ప్రత్యేక  గదుల్లో 30 మంది చొప్పున సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల విద్యార్థులు పత్రాల పరిశీలనకు సంబంధిత అధికారులను ఆహ్వానించినట్టు తెలిపారు.