చంద్రబాబు ఓటమి, కమ్మ అభిమానుల వీరాభిమానంపై సోషల్ మీడియాలో స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొందరు కమ్మ అభిమానులు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరించడం వల్లే చంద్రబాబు పతనం అయ్యారని అన్నారు. కమ్మ వాళ్లే టీడీపీ బలం అయినప్పటికీ .. వారిలో కొందరి మ్యాడ్ నెస్ చంద్రబాబు డౌన్ ఫాల్ కు కారణం అయ్యిందని చెప్పారు. ఇది చాలా బాధకరమైన విషయం అన్నారు.
రాజ్యసభ టీడీఎల్పీని బీజేపీలో విలీనంపైనా వర్మ స్పందించారు. ఆనాడు ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్న టైమ్ లో నాదండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారనీ.. ఇపుడు కూడా చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పుడు టీడీపీ ఎంపీలు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశానికి పుట్టుకనిస్తే… చంద్రబాబు దాని చావుకు కారణమయ్యారని కూడా అన్నారు వర్మ.
It’s mad Kammas like this who brought CBN’s downfall..SAD! https://t.co/0PXT6U2mLx pic.twitter.com/tPlTBa9Oab
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2019