గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు

 గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు

నెట్ వర్క్​, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఐకేపీ, పీఏసీఎస్​ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.  మాక్లూర్ మండలం వెంకటాపూర్​లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని  జడ్పీ చైర్మన్​దాదన్నగారి విఠల్​రావు ప్రారంభించారు.  సర్పంచ్ భవాని , పీడీ చందర్​నాయక్​తదితరులు పాల్గొన్నారు.  బిచ్కుంద మండలం వాజీద్​నగర్​లో  ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని   ఎమ్మెల్యే హన్మంత్​షిండే ప్రారంభించారు.  ఎంపీపీ అశోక్​పటేల్​, జడ్పీటీసీ భారతిరాజు, సర్పంచ్​  అనసూయ తదితరులు పాల్గొన్నారు. రెంజల్​మండలంలోని నీలా గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని వైస్​ఎంపీపీ యోగేశ్​ ప్రారంభించారు. సర్పంచ్​లలిత, ఎంపీటీసీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.  నిజామాబాద్.. గూపన్​పల్లి, ముత్తకుంట సొసైటీ పరిధిలోని మల్కాపూర్​తండా, మల్లారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ అనూష,  చైర్మన్​రవీందర్​ప్రారంభించారు.   నవీపేట మండలం నాగేపూర్​సొసైటీ పరిధిలోని యంచలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్​శైలేశ్​ప్రారంభించారు. సిరికొండ మండలం.. పోత్నూర్​, మైలారం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సంగీత ప్రారంభించారు. సర్పంచ్​లు మంజుల, రమ్య, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్లను దళారులకు  అమ్మి మోసపోకుండా, కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని లాభాలు పొందాలన్నారు. 

పక్క రాష్ట్రాల నుంచి వడ్లు  రాకుండా చూడాలి

కామారెడ్డి టౌన్​,  వెలుగు: యాసంగి సీజన్ వడ్లు  ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రాకుండా  జిల్లా యంత్రాంగం  కట్టడి చేయాలని  డీజీపీ అంజనీకుమార్​ జిల్లా ఆఫీసర్లకు సూచించారు. మంగళవారం  ఆయన జిల్లా ఆఫీసర్లతో  వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు.  డీజీపీ మాట్లాడుతూ..  కర్నాటక, మహారాష్ర్ట లు  జిల్లాకు బార్డర్ ఉండడంతో  అక్కడి నుంచి వడ్లు  రాకుండా చెక్​ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్​   ఎస్పీ పాల్గొన్నారు.  కలెక్టరేట్​లో కంట్రోల్​రూం..కామారెడ్డి కలెక్టరేట్​లో  వడ్ల కొనుగోలు కోసం కంట్రోల్​ రూం ఏర్పాటు చేశారు.  కంట్రోల్​ రూం ను మంగళవారం  అడిషనల్​ కలెక్టర్  చంద్రమోహన్​ ప్రారంభించారు.