హైదరాబాద్ పాతబస్తీ DRDL ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా...మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృత దేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట్ ప్రధాన రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు డివైడర్ ని ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సన్ సిటీ నుంచి మెహదీ పట్నం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.