పాత బస్తీలో రెండు బైక్‌లు ఢీకొని.. ఒకరి మృతి

పాత బస్తీలో రెండు బైక్‌లు ఢీకొని.. ఒకరి మృతి

హైదరాబాద్ పాతబస్తీ DRDL  ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా...మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృత దేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు.. రంగారెడ్డి జిల్లా హైదర్ షాకోట్ ప్రధాన రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు డివైడర్ ని ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సన్ సిటీ నుంచి మెహదీ పట్నం వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. 

మరిన్ని వార్తల కోసం..

ధ్వంసమైన గుడిని కట్టించి.. పూజలు చేసిన పాకిస్థాన్ చీఫ్ జస్టిస్!

బాత్రూమ్‌లో యువకుడి ఆత్మహత్య.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

విమెన్​ ​అండ్ ​చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​లో ఏడేళ్ల తర్వాత రిక్రూట్‌మెంట్