IPL 2024: చెన్నై చేరుకున్న బెంగళూరు జట్టు.. ఎయిర్ పోర్ట్‌లో కోహ్లీ క్రేజ్ అదరహో

IPL 2024: చెన్నై చేరుకున్న బెంగళూరు జట్టు.. ఎయిర్ పోర్ట్‌లో కోహ్లీ క్రేజ్ అదరహో

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2024 సంగ్రామానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. తొలి రోజే (మార్చి 22) హై వోల్టేజ్ మ్యాచ్ తో ఫ్యాన్స్ కు కిక్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమైపోయాయి. ఈ మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఆటగాళ్లు నిన్న (మార్చి 19) తమ ప్రారంభ మ్యాచ్‌కు ముందు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు.

 బెంగళూరులో నిన్నఏర్పాటు చేసిన క్యాంప్‌లో RCB ఆటగాళ్లు సమావేశమయ్యారు. కొత్త IPL సీజన్ కోసం తమ సన్నాహాలను ప్రారంభించారు. మంగళవారం(మార్చి 19) ఆర్సీబీ అన్‌బాక్స్ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి కొత్త జెర్సీని ఆవిష్కరించింది. స్మృతి మంధాన సారథ్యంలోని జట్టు తమ తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ అందుకోవడంతో ఆర్సీబీ మహిళల జట్టు  చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల నుండి ఘనస్వాగతం పొందింది. 

అన్‌బాక్స్ ఈవెంట్ తర్వాత.. ఆటగాళ్లు రాత్రి చెన్నైకి బయలుదేరారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెన్నైలోని ప్రేక్షకులు అద్భుతమైన రిసెప్షన్‌తో స్వాగతం పలికారు. ఇటీవలే కోహ్లీ రెండు నెలల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. దీంతో చెన్నైలో కోహ్లీని చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఓ వైపు కోహ్లీ, మరో వైపు ధోనీని చూడడానికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.