
- హైదరాబాద్లో ప్రాపర్టీ కొనేందుకే...
న్యూఢిల్లీ: వాణిజ్య ఆస్తుల్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్( పాక్షిక యాజమాన్యాన్ని) పొందడానికి పెట్టుబడిదారులకు సహాయపడే వ్యాపారంలోకి ఇటీవల ప్రవేశించిన ప్రాప్టెక్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్(హెచ్ఎన్ఐ) నుంచి రూ.112 కోట్లు సేకరించింది. ఈ డబ్బుతో హైదరాబాద్లో లక్ష చదరపు అడుగులకుపైగా ఆఫీస్ స్పేస్ను కొంటామని తెలిపింది. ఫ్రిక్షనల్ ఓనర్షిప్ కోసం పెట్టుబడిదారులకు కంపెనీ అందిస్తున్న మొదటి ఆస్తి ఇదే అని ప్రాపర్టీ లోన్స్, బ్రోకరేజ్ వ్యాపారంలో ఉన్న స్క్వేర్ యార్డ్స్ తెలిపింది. స్క్వేర్ యార్డ్స్కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ సేవలు, డేటా ఇంటెలిజెన్స్ విభాగం ప్రాప్స్ ఏఎంసీ, హైదరాబాద్లో తన మొదటి గ్రేడ్ ఏ కమర్షియల్ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరించినట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 250 మంది పెట్టుబడిదారుల నుండి సగటున రూ. 40 లక్షల పెట్టుబడి పెట్టారని, ఫ్రిక్షనల్ ఓనర్షిప్ బిజినెస్లో ఇది తమకు తొలి వెంచర్ అని ప్రకటించింది.
పెట్టుబడిదారులు తమపై ఉంచిన నమ్మకం వల్లే రూ. 100 కోట్ల ఏయూఎం (నిర్వహణలో ఉన్న ఆస్తి) మైలురాయిని చేరుకున్నామని స్క్వేర్ యార్డ్స్ సీఈఓ తనూజ్ షోరి అన్నారు. అద్దె ఆదాయం, క్యాపిటల్ పెంపు ద్వారా పెట్టుబడిదారులకు లాభదాయకమైన రాబడిని పొందడంలో సహాయపడటం ప్రధాన లక్ష్యమని అన్నారు. టైర్-1 నగరాల్లో ఆస్తులను నిర్మించడం ద్వారా రాబోయే ఆరు నెలల్లో రూ. 1,000 కోట్ల ఏయూఎంకి చేరుకోవాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ కమర్షియల్ ప్రాపర్టీ పెట్టుబడిదారులకు 8 శాతం స్థూల రాబడిని అందిస్తుంది. పన్నులు పోగా ఎక్స్ఐఆర్ఆర్ (విస్తరించిన అంతర్గత రాబడి) 14–-15 శాతం ఉంటుంది. భారత దేశంలో ఫ్రిక్షనల్ ఓనర్షిప్ మార్కెట్ చాలా ప్రారంభ దశలో ఉందని, మొత్తం 4-5 సంస్థల దగ్గర దాదాపు రూ. 1,200 కోట్ల ఏయూఎం ఉందని స్క్వేర్ యార్డ్స్ అసెట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ డేటా ఇంటెలిజెన్స్ సీబీఓ ఆనంద్ మూర్తి అన్నారు. మైకేర్ క్యాపిటల్, స్ట్రాటా, హబైట్స్, ప్రాప్క్యాటలిస్ట్ ఈ డొమైన్లో ప్రధాన కంపెనీలు.