అలంపూర్ లో ఓ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.1.48 లక్షలు మాయం

అలంపూర్ లో  ఓ వ్యక్తి  అకౌంట్ నుంచి రూ.1.48 లక్షలు మాయం

అలంపూర్, వెలుగు: ఓ వ్యక్తి ​అకౌంట్ నుంచి రూ.1.48 లక్షలు మాయమయ్యాయి. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవెల్లి మండలం కంచుపాడుకు చెందిన వెంకటేశ్వర్​రెడ్డి మంగళవారం బ్యాంక్​కు వెళ్లి, తన ఖాతాలో డబ్బులు చెక్​చేయించాడు. రూ.1.48 లక్షలు తగ్గడంతో.. అధికారులను ఆరా తీశాడు. 

వారు ఈ నెల 3న మధ్యాహ్నం 12.30 గంటలకు డబ్బులు కట్​అయినట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు మాయమవడంపై బాధితుడు బుధవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.