జర్నలిస్టులకు రూ. 50 లక్షల ఇన్సురెన్స్ కల్పించిన అస్సాం

జర్నలిస్టులకు రూ. 50 లక్షల ఇన్సురెన్స్ కల్పించిన అస్సాం

కరోనా కారణంగా ఎంతోమంది చనిపోతున్నారు. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వైద్యులు, పోలీసులు, జర్పలిస్టులు ఇలా ఎంతోమంది ప్రతిరోజూ మృత్యువాత పడుతున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు వైద్యులు, పోలీసులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాయి. కానీ, జర్నలిస్టులకు మాత్రం కల్పించలేదు. తాజాగా తమ రాష్ట్రంలోని జర్నలిస్టులకు రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిస్టులతో పాటు హోంగార్డులకు కూడా ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆ బిల్లును గురువారం అస్సాం కేబినేట్ ఆమోదించింది. విధి నిర్వహణలో జర్నలిస్టులు, హోం గార్డులు, మరియు సాధారణ ఉద్యోగులు చనిపోతే ఈ పథకం వర్తిస్తుంది.

ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ బీమా సౌకర్యం కల్పించే ప్రతిపాదనను ఆమోదించినట్లు పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రి చంద్రమోహన్ పటోవరీ తెలిపారు. అదేవిధంగా గ్రూప్ -3, గ్రూప్- IV ఉద్యోగులకు వయోపరిమితిని రెండేళ్లకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది.

మంగల్‌డోయిలో రూ. 900 కోట్ల అంచనా వ్యయంతో స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి అస్సాం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ బిల్లుకు ఆమోదం లభించిందని పటోవరీ తెలిపారు. అదేవిధంగా అస్సాం హెరిటేజ్ ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ బిల్లుకు కేబినేట్ ఆమోదం లభించింది. ధన్సిరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాబార్డ్ నుండి రూ .116 కోట్ల గ్రాంట్ తీసుకోవాలని కేబినేట్ నిర్ణయించింది. రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఓరునోడోయి పథకాన్ని కేబినేట్ ఆమోదించింది.

For More News..

కరోనా పేరు చెప్పి టెస్టుల దందా

‘రియల్’ టెన్షన్ పుట్టిస్తున్న రియల్ ఎస్టేట్ 

దేశంలో ఫస్ట్ టైం హయ్యస్ట్ రికార్డు కరోనా కేసులు