- కరోనా ఇన్పేషెంట్లకు రోజుకు రూ.50వేల బిల్లు
- జిల్లాల్లో దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటళ్లు
వరంగల్/ కరీంనగర్/ సంగారెడ్డి/మంచిర్యాల, వెలుగు: కరోనా సెకండ్వేవ్ప్రైవేట్హాస్పిటల్స్కు కాసులు కురిపిస్తోంది. సెకండ్వేవ్ఎఫెక్ట్ తీవ్రంగా ఉందన్న ప్రచారం, రోజురోజుకు పాజిటివ్కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ప్రాణభయంతో ప్రైవేట్హాస్పిటళ్లకు పరుగులు పెడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని హాస్పిటళ్ల యజమానులు అందినంత దండుకుంటున్నారు. లక్ష అడ్వాన్స్కడితేనే బెడ్ఇస్తున్నారు. స్పెషల్రూమ్కు రూ.20 వేలు, ఐసీయూకు రూ.30 వేలు, మెడికల్, ల్యాబ్, డాక్టర్చార్జీలంటూ రోజుకు రూ.50 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. గర్నమెంట్ రేట్లను పట్టించుకోకుండా సొంత రేట్లు ఫిక్స్ చేశారు. పేదలను పీల్చిపిప్పి చేయడమే కాకుండా విలువైన ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
ఐసీయూలో బెడ్కు రూ.30వేలు
20 బెడ్స్కు మించి కెపాసిటీ ఉన్న ప్రైవేట్ఆసుపత్రులన్నింటిలో కోవిడ్ట్రీట్మెంట్కు రాష్ట్ర సర్కారు పర్మిషన్ఇచ్చింది. ఇదే అదునుగా అన్ని జిల్లాల్లో ప్రైవేట్హాస్పిటల్స్కార్పొరేట్ఆసుపత్రులకు దీటుగా కరోనా పేషెంట్లను దోచుకుంటున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో కోవిడ్ట్రీట్మెంట్ కోసం వచ్చే వారి నుంచి ప్రైవేటు హాస్పిటల్స్పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇద్దరికో నర్సును కేర్ టేకర్గా పెట్టి వాళ్లకు కావాల్సిన పీపీఈ కిట్లు, గ్లౌజ్లు, మాస్కుల ఖర్చు, వేస్ట్ మేనేజ్మెంట్చార్జీలు, పీఆర్వోలు, ఆర్ఎంపీలకు ఇచ్చే కమీషన్లు.. ఇలా అన్నీ పేషెంట్ల అకౌంట్లోనే వేస్తున్నారు. స్పెషల్ రూంకు రోజుకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు, ఐసీయూకు రూ.30వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వీటికి మెడికల్, ల్యాబ్బిల్లు అదనం. ఇలా ఒక్కో పేషెంట్కు ఐదు రోజులైనా ట్రీట్మెంట్అందిస్తున్నారు. జిల్లాలో 171 ప్రైవేట్హాస్పిటల్స్కు పర్మిషన్ ఇవ్వగా, వాటిలో కేవలం 19 హాస్పిటల్స్లో శుక్రవారం సాయంత్రం వరకు 349 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మొన్నటివరకు ఒక్కో ఆసుపత్రిలో సగటున 10 మంది ఇన్పేషెంట్లుగా ఉంటే గురువారం 75, శుక్రవారం 55 మంది పేషెంట్ల చొప్పున ఉన్నారు.
అడ్వాన్స్గా రూ. లక్ష కట్టాల్సిందే..
కరీంనగర్లోని ప్రైవేట్హాస్పిటల్స్లో రూ.లక్ష అడ్వాన్స్కడితేనే పేషెంట్లను అడ్మిట్ చేసుకుంటున్నారు. బెడ్, రూమ్ కీపింగ్, నర్సింగ్, డాక్టర్, చెస్ట్ ఫిజీషియషన్ చార్జీలు అంటూ రోజుకు రూ.10వేలు తీసుకుంటున్నారు. మెడిసిన్కు మరో రూ.10 వేలు అవుతున్నాయి. ఆక్సిజన్పెడితే గంటకు రూ.300, వెంటిలేటర్కు రూ.7,500 చొప్పున వసూలు చేస్తున్నారు. చాలాచోట్ల ఆక్సిజన్ పెట్టి వెంటిలేషన్ ఫీజులు గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెమ్డెసివిర్ఇంజక్షన్ కు రూ.6వేలు, స్క్రీనింగ్ టెస్టుల పేరుతో రూ.1,500 వసూలు చేస్తున్నారు. ఎటువంటి స్కానింగ్కు అయినా రూ.3వేలకు మించి వసూలు చేస్తే యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించినా ఎవరూ పట్టించుకోడం లేదు. అన్నీ కలిపి రోజుకు రూ.50 వేల నుంచి రూ.60వేలు వసూలు చేస్తున్నారు.
అటెండర్లతో సపర్యలు
సంగారెడ్డిలో 11 ప్రైవేట్ హాస్పిటళ్లలో కోవిడ్ట్రీట్మెంట్కు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ రోజుకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ లేకపోయినా ఐసీయూలో పెట్టి క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా పేషెంట్ల వద్ద నర్సింగ్స్టాఫ్ ఉండకుండా అటెండెంట్లతో సపర్యలు చేయిస్తున్నారు. వారికి వైరస్ సోకే ప్రమాదం ఉన్నా పట్టించుకోవడం లేదు.
రెమ్డెసివిర్ ఇంజక్షన్కు రూ.10వేలు
రాష్ర్టవ్యాప్తంగా రెమ్డెసివిర్ఇంజక్షన్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కండీషన్సీరియస్గా ఉన్న కరోనా పేషెంట్లకు ఆరు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంజక్షన్కు వివిధ కంపెనీల ధరలు రూ.3వేల లోపు ఉన్నాయి. ఈ లెక్కన ఆరింటికి రూ.18వేలు ఖర్చవుతుంది. కానీ మంచిర్యాలలోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇంజక్షన్ల కొరత సాకుతో ఒక్కోటి రూ.10వేల చొప్పున ఆరింటికి రూ.60వేలు వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 19 ప్రైవేట్ హాస్పిటల్స్లో కోవిడ్ ట్రీట్మెంట్కు పర్మిషన్ ఉంది. అన్నీ కలిపి 200 ఐసీయూ బెడ్స్, 15 వరకు వెంటిలేటర్లు ఉన్నాయి. పేషెంట్ల కండీషన్ను బట్టి ఐసీయూ, మెడిసిన్, ల్యాబ్, డాక్టర్ చార్జీలు రోజుకు రూ.30వేల నుంచి రూ.40వేల దాకా గుంజుతున్నారు.
ఎంజీఎంకు వస్తలేరు
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ల కోసం 440 బెడ్లు ఉన్నా.. అందులో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ఇక్కడ పేషెంట్లను సరిగ్గా పట్టించుకోరనే ప్రచారం, తిండి, సౌకర్యాల విషయంలో గతంలో చోటుచేసుకున్న ఘటనల దృష్ట్యా పేషెంట్లు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎంజీఎంలో 440 కోవిడ్ బెడ్లు ఉండగా.. శనివారం వరకు 177 మంది పేషెంట్లు ఉన్నారు. 263 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. అదే టైంలో ప్రైవేట్హాస్పిటల్స్లో బెడ్ల కోసం ఎగబడుతున్నాడు.
మహారాష్ట్ర పేషెంట్ల తాకిడి
పొరుగున ఉన్న మహారాష్ర్టలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అక్కడి హాస్పిటల్స్లో బెడ్స్ దొరక్కపోవడంతో సరిహద్దు ప్రాంతాలకు చెందిన పేషెంట్లు తెలంగాణ బాటపడుతున్నారు. నాందేడ్ వైపు నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్కు.. చంద్రాపూర్, బల్లార్షా, సిరొంచా ప్రాంతాల నుంచి మంచిర్యాల, కరీంనగర్, వరంగల్లోని హాస్పిటళ్లకు పేషెంట్లు వస్తున్నారు. అటెండెంట్లు, అంబులెన్స్ డ్రైవర్లు, స్టాఫ్ కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడ తిరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వారం రోజులకు రూ.4.20 లక్షల బిల్లు
సంగారెడ్డి టౌన్ నేషనల్ హైవేపై ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వికారాబాద్ జిల్లా పులిమామిడికి చెందిన 70 ఏళ్ల అవ్వ వారం కింద అడ్మిట్అయ్యింది. రోజుకు రూ.40 వేల చొప్పున 8 రోజులకు రూ.3.2 లక్షలు, ఇతర చార్జిలు మరో రూ.లక్ష కలిపి రూ.4.20 లక్షల బిల్లు చేతిలో పెట్టారు. అడ్వాన్స్ పోను మిగతా బ్యాలెన్స్ కడితేనే పేషెంట్ను పంపిస్తామన్నారు. దీంతో ఆమె బంధువులు డాక్టర్లతో గొడవపడ్డారు. లీడర్ల జోక్యంతో బిల్లులో రూ.లక్ష తగ్గించారు.
చేర్చుకున్నరు.. చేతులెత్తేసిన్రు
అందోల్ మండలం సాయిబాబాపేటకు చెందిన 65 ఏళ్ల మహిళ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. ఆమె భర్త (74)కూ పాజిటివ్ రావడంతో అక్కడే చేరాడు. పెద్దా యన కండీషన్ సీరియస్గా మారడంతో చేతులెత్తేశారు. మూడు రోజులకు రూ.1.10 లక్షల బిల్లు వేశారు. ఇంటికి వెళ్లిన మరుసటి రోజే పెద్దాయన చనిపోయాడు. ఆయన భార్య ఆరు రోజులకు కోలుకొని ఇంటికి వచ్చేసరికి భర్త చనిపోయిన విషయం తెలిసి కన్నీరుమున్నీరైంది.