
- బియ్యం విలువ రూ.5.88 కోట్లు
- కమిషనరేట్కు ఆఫీసర్ల లెటర్ ఇంకా రిప్లయ్రాలే
యాదాద్రి, వెలుగు : ఉగాది నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులు సన్న బియ్యం ఇస్తూ ఉండడంతో గతంలోని దొడ్డు బియ్యం నిల్వలు అలానే ఉండిపోయాయి. వాటిని ఏం చేయాలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. పైగా ఆ బియ్యానికి పురుగు పడుతోంది. దీంతో దొడ్డు బియ్యం నిల్వలపై సివిల్సప్లయ్ మల్లగుల్లాలు పడుతోంది.
జిల్లాలో 515 రేషన్ షాపులు..
యాదాద్రి జిల్లాలో 515 రేషన్షాపులు ఉన్నాయి. 2,18,963 రేషన్కార్డులున్నాయి. 7.20 లక్షల మంది మెంబర్లున్నారు. పంపిణీ కోసం ప్రతినెలా 4,500 టన్నుల బియ్యం అవసరం పడుతోంది. అయితే ఉగాది నుంచి రేషన్షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నారు. పైగా ఏ ఒక్కరికీ దొడ్డు బియ్యం ఇచ్చినా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉన్నాయి.
1,635 టన్నుల దొడ్డు బియ్యం..
సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉండిపోయాయి. దీంతో ఆ బియ్యానికి పురుగు పడుతోంది. ఈ పురుగు సన్న బియ్యానికి కూడా పడుతుందేమోనని రేషన్డీలర్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని రేషన్షాపుల్లో 1100 టన్నుల దొడ్డు బియ్యం ఉండగా, ఎంఎల్ఎస్ పాయింట్లలో 185 టన్నులు, బఫర్గోడౌన్లలో 350 టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి.
దొడ్డు బియ్యం ఏం చేద్దాం..
ప్రభుత్వ లెక్కల ప్రకారం నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విలువ రూ.5.88 కోట్లు ఉంటుంది. ఈ బియ్యం నిల్వలను ఏం చేయాలో సివిల్సప్లయ్డిపార్ట్మెంట్నిర్ణయం తీసుకోలేదు. షాపుల్లో దొడ్డు బియ్యం స్టాక్ ఉండడం వల్ల సన్న బియ్యం నిల్వ చేసుకోవడానికి ప్లేస్ సరిపోవడం లేదు. దీంతో దొడ్డు బియ్యం ఖాళీ చేయాలని రేషన్డీలర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ బియ్యం నిల్వలను ఏం చేయాలనే అంశంపై కమిషనరేట్కు జిల్లా ఆఫీసర్లు లెటర్ రాశారు. నెల రోజులు గడుస్తున్నా.. అక్కడి నుంచి రిప్లయ్ రాలేదు.
టెండర్ వేస్తరా.? ఫిలిప్పీన్స్కు పంపుతారా..?
రైస్ మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ అందించకపోవడంతో 2022-–23 యాసంగి సీజన్కు సంబంధించిన 1.88 లక్షల టన్నుల వడ్లను ప్రభుత్వం టెండర్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిల్వ ఉన్న దొడ్డు బియ్యం కూడా టెండర్ వేసే అవకాశాలున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. టెండర్వేస్తే కోళ్లకు దాణాగా ఉపయోగించడానికి ఫౌల్ట్రీ ఫారాల యజమానులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. లేని పక్షంలో లిక్కర్ కంపెనీలకు తరలించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఈ రెండు కాకుండా ఇటీవల ఫిలిప్పీన్స్కు బియ్యం పంపినట్టుగానే పంపే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
ఫిలిప్పీన్స్కు పంపాలంటే బియ్యానికి పాలిష్..
అయితే ఫిలిప్పీన్స్కు బియ్యం పంపించాలంటే మళ్లీ పాలిష్చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్టాక్ఉన్న బియ్యానికి సిల్క్ లేదా వాటర్ పాలిష్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. పాలిష్ చేయాలంటే రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్గోడౌన్ల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉంటుంది. టెండర్వేసినా, లిక్కర్ కంపెనీలకు అమ్మినా ట్రాన్స్పోర్ట్ భారం వాళ్లపైనే పడుతుంది. పాలిష్ చేయాలంటే మాత్రం ట్రాన్స్పోర్ట్భారం సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్పైనే పడుతుంది.