మిర్యాలగూడ వైష్ణవి గ్రాండ్ హోటల్లో రూ.80 లక్షలు చోరీ

మిర్యాలగూడ వైష్ణవి గ్రాండ్  హోటల్లో రూ.80 లక్షలు చోరీ

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్  హోటల్లో రూ. 80 లక్షల నగదు చోరీ జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని సాగర్  మెయిన్​ రోడ్​ పక్కనే ఉన్న వైష్ణవి గ్రాండ్  హోటల్  నిర్వాహకులు శుక్రవారం రాత్రి ఆఫీస్  రూమ్​ డోర్  లాక్  వేసి వెళ్లిపోయారు. 

శనివారం (సెప్టెంబర్ 07) ఉదయం వచ్చి చూడగా ఆఫీస్  డోర్  లాక్  పగలగొట్టి ఉండడం, టేబుల్  డెస్క్ లు తెరిచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార నిమిత్తం ఆఫీస్  రూమ్​లో దాచిన రూ.80 లక్షలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రాజశేఖర రాజు, సీఐలు నాగభూషణ రావు, సోమ నర్సయ్య, పీఎన్ డీ ప్రసాద్, క్లూస్  టీమ్  సిబ్బంది వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్  టౌన్  పోలీసులు తెలిపారు.