హైదరాబాద్: బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుడ్బై చెప్పారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ట్వీట్ చేశారు. భారమైన హృదయంతో బీఎస్పీని వీడాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో చాన్స్ లేకుండాపోయిందన్నారు. బహుజన సమాజం తనను దయచేసి క్షమించాలని కోరారు.
‘పొత్తు (బీఆర్ఎస్–-బీఎస్పీ) పొత్తులో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్చేశారు.
Dear fellow Bahujans,
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 16, 2024
I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now.
Please forgive me for this post and I have no choice left.
With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭.
I don’t want the image of…
కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ..
బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్.. బీఆర్ఎస్చీఫ్ కేసీఆర్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని ఆయన ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ప్రవీణ్ కుమార్ ఎల్లుండి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.