అలంపూర్‌‌లో భారీగా నగదు సీజ్

అలంపూర్‌‌లో భారీగా నగదు సీజ్

అలంపూర్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా తనిఖీల్లో భాగంగా బుధవారం రూ.6,76,920 స్వాధీనం చేసుకొని గ్రీవెన్స్  కమిటీకి అప్పగించినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు.

 పుల్లూరు చెక్ పోస్ట్​ వద్ద ఐదుగురి నుంచి రూ.3,97,420, ఐజ మండలం వెంకటాపురం స్టేజీలో నిర్వహించిన తనిఖీల్లో ఒకరి నుంచి రూ.95 వేలు, మానవపాడు మండలంలో రూ.70 వేలు, నందిన్నె చెక్ పోస్ట్​ దగ్గర రూ.1,14,500 సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.