5 నుంచి ఆర్ఎస్ఎస్ సమావేశాలు

5 నుంచి ఆర్ఎస్ఎస్  సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​(ఆర్ఎస్ఎస్) జాతీయ సమన్వయ సమావేశాలు హైదరాబాద్​లో జనవరి 5 నుంచి 7 దాకా 3 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు చీఫ్ గెస్ట్​గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సంఘ్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హాజరు కానున్నారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సమావేశాలకు రానున్నారు. సంఘ్ స్ఫూర్తితో పని చేస్తున్న 36 హిందూ సంస్థల ప్రతినిధులు పాల్గోనున్నారు. ఆయా క్షేత్రాలలో జరుగుతున్న కార్యక్రమాలు, ఎదురవుతున్న సవాళ్లు, అనుభవాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సంఘ్ ప్రతినిధులు తెలిపారు. పర్యావరణం, కుటుంబ ప్రబోధన్, సామాజిక సేవ వంటి కార్యక్రమాలను సమన్వయం చేయడం గురించీ డిస్కస్ చేయనున్నట్లు తెలిపారు.