వర్ని, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పు పునరావృతం కాకుండా సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించిన తర్వాతే డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తామని రుద్రూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానించింది. మంగళవారం పంచాయతీ ఆఫీస్లో సర్పంచ్ సునీత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సభ నిర్వహించి అర్హులను గుర్తిస్తామన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ సమక్షంలో ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్, ఉప సర్పంచ్నిస్సర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
