
ముంబై: భారత రూపాయి, యూఎస్ డాలర్తో పోలిస్తే గురువారం 36 పైసలు తగ్గి రూ. 88.47 వద్ద ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఇండియా, యూఎస్ మధ్య కొనసాగుతున్న సుంకాల సమస్య దీనికి ప్రధాన కారణం. అమెరికా ద్రవ్యోల్బణ డేటాకు ముందు డాలర్ కోలుకోవడం, విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోవడం వంటివి రూపాయిపై ఒత్తిడి పెంచాయి.
ముడి చమురు ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి దారితీసింది. ఇంటర్బ్యాంక్ విదేశీ మారకంలో రూపాయి 88.11 వద్ద ప్రారంభమై, ఇంట్రాడే ట్రేడ్లో యూఎస్ డాలర్తో పోలిస్తే 88.47 వద్ద ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోయింది. దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 36 పైసలు పడిపోయి, 88.47 వద్ద రికార్డు కనిష్ట స్థాయిలో ముగిసింది. తదనంతరం కొద్దిగా కోలుకొని 88.35కి చేరింది.