
టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం దక్కనుంది. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సచిన్ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. సచిన్ పుట్టిన రోజైన ఏప్రిల్ 23న లేదా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే వెల్లడించారు. ఇప్పటికే సచిన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. వాంఖడే స్టేడియంలో ఇదే మొదటి విగ్రహం కానుంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియంలో సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉంది. కాగా సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు.