పొలం బాట పట్టిన సాయిపల్లవి 

పొలం బాట పట్టిన సాయిపల్లవి 

నిజ జీవితంలో సాదా సీదాగా కనిపించే సాయిపల్లవి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిదా సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సాయి పల్లవి అప్పట్లో ఆటోలో వచ్చి షాక్ ఇచ్చిన ిషయం తెలిసిందే. అయితే ఈ సారి అమ్మడు పొలంబాట పట్టి కూలీలను ఆశ్చర్యపరిచింది. ఫిదా సినిమాలో తెలంగాణ యాస‌లో మాట్లాడుతూ..తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది సాయిప‌ల్ల‌వి. అందం, అభిన‌యంతో అంద‌రినీ క‌ట్టిప‌డేసే ఈ మ‌ల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ పండుగ సందర్బంగా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే బ్రేక్ తీసుకుంది మాత్రం విశ్రాంతి కోసం అనుకుంటే పొర‌పాటు ప‌డ్డ‌ట్టే. బ్రేక్ స‌మ‌యాన్ని పొలం ప‌నుల కోసం వినియోగించుకుంది సాయిప‌ల్ల‌వి. ఈ భామ వ్య‌వసాయ పనులు చేస్తున్న కూలీల ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ప‌సుపు పంట తీత ప‌నులు చేస్తున్న అమ్మ‌ల‌క్క‌ళ్లాగే సాయిప‌ల్ల‌వి ఎండ నుంచి కాపాడుకోవ‌డానికి త‌ల‌కు తువాల చుట్టుకుంది. చేతిలో త‌ట్ట ప‌ట్టుకుని దుక్కిని త‌వ్వుతూ ప‌సుపు కొమ్ములను ఏరి కుప్ప చేసింది. ప‌నంతా అయిపోయిన త‌ర్వాత కూలీలందరితో క‌లిసి దుక్కిలోనే కూర్చొని ఫొటోలు దిగింది. ఈ స్టిల్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేయ‌గా ట్రెండింగ్ అవుతున్నాయి.