సాయి పల్లవి ఏంటిది.. అలా చేస్తే ఫ్యాన్స్ ఏమైపోవాలి

సాయి పల్లవి ఏంటిది.. అలా చేస్తే ఫ్యాన్స్ ఏమైపోవాలి

టాలీవుడ్​లో విరాట పర్వం, గార్గి వంటి సినిమాల తర్వాత సాయిపల్లవి జాడ లేదు. ఆ తర్వాత ఏ ఒక్క సినిమాకు కమిట్ అయినట్టుగా న్యూస్​ రాలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్​ ఆందోళన చెందారు. ఎక్స్​పోజింగ్​కు నో అనడంతోనే సాయి పల్లవికి అవకాశాలు రావడం లేదా? లేక కావాలనే సినిమాల నుంచి ఆమెను సైడ్​ చేశారా? అనే గుసగుసలు వినిపించాయి. 

తాజాగా ఈ వార్తలకు ఈ హీరోయిన్​ చెక్​ పెట్టింది. తాను సినిమాలకు కొన్ని రోజుల పాటు బ్రేక్​ తీసుకోవాలని డిసైడైయ్యానని తెలిపింది. అందుకే కొత్త కథలు వినలేదట. ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్​ ప్రాజెక్ట్​తో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. శివకార్తికేయన్​తో ఓ సినిమాలో నటించనుంది. కమల్ హాసన్​ దీనిని నిర్మిస్తున్నాడు. ఈ రోల్​ సాయి పల్లవి కెరీర్​లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. ఎప్పటిలాగే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ మరిన్ని మంచి కథలతో రావడానికి ఈ గ్యాప్​ను ఉపయోగించుకుందట.