బలమైన ఎమోషన్, యాక్షన్‌‌‌‌కి స్కోప్ ఉన్న మూవీ సైంధవ్ : వెంకటేష్

బలమైన ఎమోషన్, యాక్షన్‌‌‌‌కి స్కోప్ ఉన్న మూవీ సైంధవ్ : వెంకటేష్

వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. సోమవారం టీజర్‌‌‌‌ ఈవెంట్ నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ ‘ఒక డిఫరెంట్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నపుడు దర్శకుడు శైలేష్ ఈ కథ చెప్పాడు. బలమైన ఎమోషన్, యాక్షన్‌‌‌‌కి స్కోప్ ఉన్న కథ ఇది.

ఇందులోని ఇంటెన్స్ డ్రామాను  ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నా పాత్ర క్రేజీగా, వైల్డ్‌‌‌‌గా ఉంటుంది. కొత్త వెంకీని చూస్తారు. గతంలో చంటి, కలిసుందాం రా, లక్ష్మీ, ఎఫ్‌‌‌‌ 2 చిత్రాలు సంక్రాంతికి వచ్చి సక్సెస్ అయ్యాయి. అదే వరుసలో ‘సైంధవ్’ కూడా సక్సెస్ అవుతుంది’ అన్నారు. ‘టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని, ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.

శైలేష్ కొలను మాట్లాడుతూ ‘టీజర్‌‌‌‌‌‌‌‌లో చూసింది చిన్న గ్లింప్స్ మాత్రమే. సినిమాలో చాలా ఉంది. థియేటర్స్‌‌‌‌లో వెంకీ మామ 75ని సెలబ్రేట్ చేసుకుందాం’ అన్నాడు. వెంకటేష్ గారితో సినిమా చేయడంతో తన కల నెరవేరిందన్నారు నిర్మాత వెంకట్ బోయనపల్లి. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో ఆర్య  కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.