
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అప్పలనాయుడు చేత కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11.15 గంటలకు గవర్నర్ నరసింహన్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.