Samsung : ఏఐ ఫీచర్లతో శామ్​సంగ్​ టీవీలు

Samsung : ఏఐ ఫీచర్లతో శామ్​సంగ్​ టీవీలు

హైదరాబాద్, వెలుగు: దేశీయ మార్కెట్లోకి  ప్రీమియం ఏఐ ఇంటిగ్రేటెడ్ క్యూఎల్ఈడీ   సిరీస్  క్రిస్టల్ క్లియర్ 4కే యూహెచ్​డీ టీవీలను విడుదల చేశామని శామ్​సంగ్​ తెలిపింది. ఇవి అమెజాన్,  ఫ్లిప్‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్నాయి.   వీటిలో యూఈ81, యూఈ84, యూఈ86ఈ మోడల్స్​ఉంటాయి.

 ఈ క్యూఎల్ఈడీ టీవీల్లో శక్తివంతమైన ఏఐ ప్రాసెసర్లు ఉండటం వల్ల పిక్చర్​ క్వాలిటీ, సౌండ్ అద్భుతంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. క్వాంటం డాట్ టెక్నాలజీ వల్ల రంగులు స్పష్టంగా కనిపిస్తాయని, వీటిలో స్మార్ట్ ఫీచర్లూ ఉన్నాయని శామ్​సంగ్​పేర్కొంది.