వచ్చే ఏడాది దీపావళి నాటికి మంచి లాభాలిచ్చే షేర్లు!

వచ్చే ఏడాది దీపావళి నాటికి మంచి లాభాలిచ్చే షేర్లు!
  • రికమండ్ చేసిన ఐసీఐసీఐ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌..  నిఫ్టీ 21,500 కు వెళుతుందని వెల్లడి

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వచ్చే ఏడాది దీపావళి నాటికి నిఫ్టీ 21,500 లెవెల్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేస్తుందని బ్రోకరేజ్ కంపెనీ ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేస్తోంది. బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , పవర్  సెక్టార్ షేర్లు మంచి రిటర్న్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తాయని పేర్కొంది. మరోవైపు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ఎకానమీపై ఆధారపడే ఐటీ, ఆయిల్ అండ్‌‌‌‌‌‌‌‌ గ్యాస్  కంపెనీలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.  ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ లాభాలు, క్యాష్‌‌‌‌‌‌‌‌ ఫ్లోస్‌‌‌‌‌‌‌‌,  షేర్లపై ఎంత రిటర్న్ ఇస్తోందనే అంశాలను పట్టించుకోవాలని  ఐసీఐసీఐ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించింది.  ఏడాది కాలానికి గాను ఈ బ్రోకరేజ్‌‌‌‌‌‌‌‌ కంపెనీ కొన్ని స్టాక్స్‌‌‌‌‌‌‌‌ను రికమండ్ చేసింది.

సెంచరీ ప్లైబోర్డ్స్‌‌‌‌‌‌‌‌

2024–25 లో  సెంచరీ ప్లైబోర్డ్స్‌‌‌‌‌‌‌‌ రెవెన్యూ 15 శాతం వృద్ధి సాధిస్తుందని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనావేస్తోంది. మార్జిన్స్‌‌‌‌‌‌‌‌ (లాభాలు) తిరిగి సాధారణ స్థాయికి వస్తాయని తెలిపింది. ‘కంపెనీ అప్పులు తగ్గాయి. క్యాపెక్స్ అవసరాల కోసం ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌గా ఫండ్స్‌‌‌‌‌‌‌‌ సేకరిస్తోంది. బిజినెస్‌‌‌‌‌‌‌‌ను విస్తరిస్తోంది’ అని  పేర్కొంది.  2024 దీపావళి నాటికి సెంచరీ ప్లైబోర్డ్స్‌‌‌‌‌‌‌‌షేరు రూ.750 కి పెరుగుతుందని అంచనా వేసింది. రూ.595– రూ.630 రేంజ్‌‌‌‌‌‌‌‌లో కొనుక్కోవాలని సలహా ఇచ్చింది. కంపెనీ షేర్లు శుక్రవారం  రూ.635 దగ్గర క్లోజయ్యాయి.   రా మెటీరియల్స్ ఖర్చులు పెరగడం వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

టీవీ టుడే నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌

ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో టీవీ టుడే నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ మంచి పెర్ఫామెన్స్ చేస్తుందని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. పొలిటికల్ పార్టీల మీడియా ఖర్చులు పెరుగుతాయని తెలిపింది. ఫెస్టివల్ సీజన్ స్టార్టయిన తర్వాత  కంపెనీ యాడ్ రెవెన్యూ రికవరీ అవుతోందని వెల్లడించింది.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో టీవీ టుడే నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ రెవెన్యూ  9 శాతం పెరిగి రూ. వెయ్యి కోట్లు దాటుతుందని పేర్కొంది.  కంపెనీ షేర్లను రూ.185–200 రేంజ్‌‌‌‌‌‌‌‌లో  కొనుగోలు చేయాలని సలహా ఇచ్చింది. టీవీ టుడే షేర్లు రూ.209 దగ్గర శుక్రవారం క్లోజయ్యాయి.  మార్కెట్‌‌‌‌‌‌‌‌ వాటా తగ్గడం, డిజిటల్ ఖర్చులు పెరగడం వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

ఎల్ అండ్ టీ

ఇంజినీరింగ్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎల్ అండ్ టీ పై ఐసీఐసీఐ డైరెక్ట్ పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ప్రభుత్వం క్యాపెక్స్‌‌‌‌‌‌‌‌ కోసం కేటాయింపులు పెంచడంతో ఈ కంపెనీ  ఎక్కువగా లాభపడుతుందని అభిప్రాయపడింది.  కంపెనీ రెవెన్యూ, ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఏడాది కాలంలో పెరుగుతాయని తెలిపింది.  షేరు ధర రూ.2,870 – 2,960 రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు  కొనుక్కోవాలని సలహా ఇచ్చింది. కంపెనీ షేరు రూ.3,031 దగ్గర శుక్రవారం క్లోజయ్యింది. కంపెనీ మార్జిన్స్‌‌‌‌‌‌‌‌ రికవర్ కాకపోవడం వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

కోరమండల్‌‌‌‌‌‌‌‌ ఇంటర్నేషనల్

కోరమండల్ ఇంటర్నేషనల్ షేరును రూ.1,020 – 1,080  రేంజ్‌‌‌‌‌‌‌‌లో కొనుక్కోవాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సలహా ఇచ్చింది. శుక్రవారం రూ.1,099 దగ్గర ఈ కంపెనీ షేరు ముగిసింది.  ఈ ఎరువుల కంపెనీ ఫాస్పరిక్  యాసిడ్ అవసరాలను చేరుకోవడానికి టైఫర్ట్‌‌‌‌‌‌‌‌, ఫోస్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీలతో టై అప్ అయ్యిందని, ఇప్పుడున్న డీఏపీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో 50 శాతం మార్కెట్‌‌‌‌‌‌‌‌ వాటాను  కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన నానో డీఏపీ పొందే అవకాశం ఉందని అంచనా వేసింది.  వాతావరణం బాగోలేకపోవడం, ప్రభుత్వ పాలసీలు, క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

భారత్ డైనమిక్స్‌‌‌‌‌‌‌‌

వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ డైనమిక్స్‌‌‌‌‌‌‌‌ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ 53 శాతం పెరగొచ్చని ఈ బ్రోకరేజ్ కంపెనీ వెల్లడించింది. మాన్యుఫాక్చరింగ్ కాస్ట్ తక్కువగా ఉండడం, గ్లోబల్ మార్కెట్లలో వడ్డీ రేట్లు పెరగడంతో ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో కంపెనీకి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపింది. రూ. 970–1,030 రేంజ్‌‌‌‌‌‌‌‌లో షేర్లు కొనుక్కోవాలని సలహా ఇచ్చింది. కంపెనీ షేర్లు శుక్రవారం రూ.1,052 దగ్గర సెటిలయ్యాయి.  ప్రభుత్వ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌లపై ఆధారపడడం, కీలక కాంపోనెంట్ల కోసం ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్ మాన్యుఫాక్చరర్ల (ఓఈఎం)పై ఆధారపడడం  వంటి  రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ

స్టేట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ, రిటైల్‌‌‌‌‌‌‌‌ లోన్లు  పెరుగుతున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. రెవెన్యూ ఏడాదికి14–15 శాతం పెరుగుతుందనే  నమ్మకంతో బ్యాంక్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్  ఉందని వెల్లడించింది. షేరు ధర రూ.565 – 585 రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు కొనుక్కోవాలని తెలిపింది. బ్యాంక్ షేర్లు రూ. 580 దగ్గర శుక్రవారం సెటిలయ్యాయి. కార్పొరేట్ లోన్లు డిస్‌‌‌‌‌‌‌‌బర్స్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ నెమ్మదించడం, డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ పెరగడం వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి.

స్పందనా స్పూర్తి ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌

గత ఆరు క్వార్టర్లుగా కంపెనీ రికవరీ అవుతోందని, రిటర్న్ ఆన్ అసెట్స్‌‌‌‌‌‌‌‌ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓఈ) మెరుగుపడిందని ఐసీఐసీఐ డైరెక్ట్ వెల్లడించింది. అప్పులపై చేసే ఖర్చు తగ్గడం, మార్జిన్స్ నిలకడగా ఉండడం, బిజినెస్ వృద్ధి చెందుతుండడంతో ఈ కంపెనీ షేర్లు మంచి రిటర్న్ ఇస్తాయని అంచనా వేసింది. షేరు ధర రూ.840– 890 రేంజ్‌‌‌‌‌‌‌‌లో కొనుక్కోవాలని సలహా ఇచ్చింది. రూ.980 దగ్గర శుక్రవారం ముగిసింది. రీపేమెంట్లలో వోలటాలిటీ కనిపిస్తుండడం వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఎదుర్కొంటోంది.