శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.12 లక్షల ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.12 లక్షల ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

చెన్నై: స్లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 12 లక్షల ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. బుధవారం చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్ణీత టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేయాల్సిన ఓవర్ల కోటాను అతను పూర్తి చేయించేలేకపోయాడు. దీంతో అతనిపై ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చర్యలు తీసుకుంది. తొలి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతోనే సరిపెట్టింది. 

అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా తేమ ఎక్కువగా ఉండటంతో అంపైర్లు బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చడంపై అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో అతను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2.7లోని లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1 తప్పిదం చేశాడని రిఫరీ తేల్చడంతో చర్యలు తీసుకున్నారు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టుగా తాము బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చమని అడగకపోయినా అంపైర్లు మార్చేశారని అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నాడు.