
వనపర్తి/మదనాపురం, వెలుగు: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సరళా సాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 0.50టీఎంసీలు కాగా, భారీగా వరద చేరడంతో ఆటోమెటిక్ సైఫన్ సిస్టంలోని రెండు ప్రైమరీ, రెండు వుడ్ సైఫన్లు తెరచుకుని 14 వేల క్యూసెక్కుల నీరు రామన్ పాడు ప్రాజెక్టులోకి చేరుతోంది.
వనపర్తి, -కొత్తకోట,-ఆత్మకూరు ప్రధాన రోడ్డులో రైల్వే గేట్ సమీపంలో ఉన్న లో లెవెల్ కాజ్ వే మీదుగా వరద నీరు ప్రవహించడంతో మూడు రోజులుగా ఆత్మకూరు–-వనపర్తి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఊక చెట్టు వాగులోకి సరళా సాగర్ నీటితో పాటు శంకర సముద్రం నుంచి వరద వచ్చి చేరుతుండడంతో దంతనూరు, శంకరమ్మపేట గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.
రామన్పాడు ప్రాజెక్టు రెండు గేట్లను ఓపెన్ చేసి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్ తెలిపారు. వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా తహసీల్దార్ జేకే మోహన్, ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు
అప్రమత్తం చేస్తున్నారు