కరోనా ఎఫెక్ట్‌:  అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయనున్న సౌదీ అరేబియా

కరోనా ఎఫెక్ట్‌:  అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయనున్న సౌదీ అరేబియా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసంలో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది. అయితే మసీదులను తెరచి వుంచితే, కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మూసివేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు.

ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. తరావీ నమాజ్ లను, రంజాన్ ఈద్ నమాజ్ ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని ఆయన సూచించారు.