రూ.50 వేల కోట్లు సేకరించనున్న ఎస్​బీఐ

 రూ.50 వేల కోట్లు సేకరించనున్న ఎస్​బీఐ

న్యూఢిల్లీ: ప్రైవేట్ ప్లేస్‌‌‌‌మెంట్ ప్రాతిపదికన డెట్ ఇన్‌‌‌‌స్ట్రుమెంట్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల వరకు నిధులు సేకరించాలని ఎస్​బీఐ నిర్ణయించింది.   దీర్ఘకాలిక బాండ్‌‌‌‌లు, బాసెల్ 3 కంప్లైంట్ అడిషనల్ టైర్ 1 బాండ్‌‌‌‌లు, బాసెల్ 3 కంప్లైంట్ టైర్ 2 బాండ్‌‌‌‌లతోపాటు  రూపాయి లేదా ఏదైనా ఇతర కన్వర్టబుల్ కరెన్సీలో నిధులను సేకరిస్తారు.

తన విదేశీ వ్యాపార వృద్ధికి నిధులు సమకూర్చడానికి  10-బిలియన్​ డాలర్ల గ్లోబల్ మీడియం నోట్ ప్రోగ్రామ్ కింద ఎస్​బీఐ గత నెల కూడా 750 మిలియన్​ డాలర్లను సేకరించింది.