స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ATMలో డబ్బులు డ్రా చేసేందుకు కొత్త నిబంధన రేపటి(శుక్రవారం) నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని SBI ఏటీఎంలలో శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు తీసుకోవాలంటే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ఎంటర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి 24గంటల పాటు.. 10 వేలు రూపాయలు అంతకుమించి చేసే నగదు డ్రా చేయాలంటే పిన్ నంబర్తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డుకు లింక్ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చే OTP నమోదు చేస్తేనే ATMలో నుంచి నగదు వస్తుంది. OTP లేకపోతే 10 వేల రూపాయలకు మించి నగదు తీసుకోలేరు.
ప్రస్తుతానికి రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య SBI ATM లో రూ.10వేలకు మించి చేసే విత్ డ్రాలకు వినియోగదారుల మొబైల్కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉంది. రాత్రి వేళల్లో మోసాలకు తావు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో ఈ ఏడాది జనవరిలో ఈ సదుపాయాన్ని ఎస్బీఐ తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో అన్ని వేళల్లోనూ ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది.