- సెక్యూరిటీ గార్డుపై దాడి
- 9 మంది నుంచి రూ.30 లక్షలు వసూలు
- ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన మహేశ్వర్రావు విచారణకు రాగా దాడి
మందమర్రి, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలు పెట్టిస్తానని మోసం చేశాడని ఆరోపిస్తూ గురువారం మందమర్రి సింగరేణి ఎస్అండ్పీసీ సెక్యూరిటీ విభాగం ఆవరణలో సింగరేణి పర్మినెంటు సెక్యూరిటీ గార్డు మహేశ్వర్రావుపై జైపూర్ మండలానికి చెందిన బాధితులు దాడి చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు రావడంతో గురువారం మహేశ్వర్రావును పిలిపించి మందమర్రి ఏరియా సింగరేణి సీనియర్సెక్యూరిటీ ఆఫీసర్రవి సమక్షంలో ఎంక్వయిరీ చేశారు. విషయం తెలుసుకున్న జైపూర్మండలం రసూల్పల్లి, గుడిపల్లికి చెందిన బాధితులు సెక్యూరిటీ ఆఫీస్కు వచ్చి తమ డబ్బులు తిరిగివ్వాలని మహేశ్వర్రావును నిలదీశారు. సహనం కోల్పోయిన వారు అతడిని కొట్టారు. బాధితులు మాట్లాడుతూ జూన్లో సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, జూనియర్అసిస్టెంట్ఉద్యోగాలు ఇప్పిస్తానని మహేశ్వర్రావు తొమ్మిది మంది నుంచి రూ.30 లక్షలు తీసుకున్నాడన్నారు. జూన్, జూలై నెలలో ఫేక్జాయినింగ్ లెటర్లతో ఇద్దరికి మంచిర్యాలలో స్క్రాప్ లారీల తనిఖీల పేరుతో రోడ్డుపై చెకింగ్డ్యూటీలు వేశాడన్నారు. అనుమానంతో ఆగస్టు 19న మందమర్రి సింగరేణి సెక్యూరిటీ డిపార్ట్మెంటులో ఆరా తీస్తే ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లుగా తేలిందన్నారు.
దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ రవికి ఫిర్యాదు చేశామన్నారు. అదే రోజు డబ్బులు తిరిగిస్తానని బాండ్పేపర్రాసివ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. మూడు నెలల గడిచినా డబ్బులివ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, కలర్ జిరాక్స్ చెక్కులు ఇచ్చాడని ఆరోపించారు. గురువారం ఎంక్వయిరీ కోసం సెక్యూరిటీ ఆఫీసుకు వస్తున్నాడని తెలిసి అడిగేందుకు ఇక్కడి వచ్చామన్నారు. మరోవైపు ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన పలు కేసుల్లో ఇదివరకే కోల మహేశ్వర్రావుపై మందమర్రి, రామకృష్ణాపూర్, మంచిర్యాల, నస్పూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి జైలుకు కూడా పంపించారు. సింగరేణి సంస్థ సస్పెండ్ చేసింది. తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని మహేశ్వర్రావు వివరణ ఇచ్చారు. దాడిపై తమకు మహేశ్వర్రావు నుంచి ఫిర్యాదు అందిందని మందమర్రి ఎస్సై చంద్రకుమార్చెప్పారు. బాధితులను సంబంధిత జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు చెప్పారు.