- నారాయణపేట మున్సిపల్ ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు
- చక్రం తిప్పిన లోకల్ ఎమ్మెల్యే
- జనానికి అందుబాటులో ఉండేలా కట్టే చాన్స్ ఉన్నా పట్టించుకోలే
- ఇటీవల కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
మహబూబ్ నగర్, వెలుగు: ఊరికి దూరంగా ఓ టీఆర్ఎస్ లీడర్ వెంచర్ చేసిండు.. మున్సిపల్ ఎన్నికల ముందు కారెక్కిన ఆయన ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు.. ఇంకేం లీడర్లు, ఆఫీసర్లు కలిసి చక్రం తిప్పిన్రు.. రూల్స్ ప్రకారం సదరు నేత వెంచర్ లో10 శాతం ల్యాండ్ ను మున్సిపాలిటీకి గిఫ్ట్డీడ్కింద ఇవ్వగానే ఆఫీసర్లు ఆ భూమిలో రూ. 1.45 కోట్లతో ఆధునిక హంగులతో సైన్స్పార్కు కట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన్రు. ఈ వింత నారాయణపేట టౌన్లో జరిగింది.
రుణం తీర్చుకున్న ఎమ్మెల్యే..
నారాయణపేటకు చెందిన ఓ లీడర్, గత మున్సిపల్ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. ఇందుకు కృతజ్ఞతగా స్థానిక ఎమ్మెల్యే ఆయన ‘రుణం’ తీర్చుకోవాలనుకున్నారు. టైం కోసం వేచి చూశారు. ఈలోగా సదరు టీఆర్ఎస్లీడర్ నారాయణపేట టౌన్శివార్లలో తనకున్న 30 ఎకరాల వ్యవసాయభూమిలో 12 ఎకరాలను వెంచర్గా మార్చారు. రూల్స్ ప్రకారం 10 శాతం ల్యాండ్ ను మున్సిపాలిటీకి గిఫ్ట్డీడ్ చేశారు. ఈ క్రమంలో ఆ లీడర్ వెంచర్కు, భూములకు డిమాండ్ వచ్చేలా ఆఫీసర్లతో కలిసి ఎమ్మెల్యే చక్రం తిప్పారు. వెంచర్లోని మున్సిపల్ ల్యాండ్లో పార్కు కట్టేందుకు ఎమ్మెల్యే సిఫార్సు చేయడం, ఓ ఉన్నతాధికారి ఆగమేఘాల మీద ఆర్డర్స్ ఇవ్వడం, ఆ అధికారికే చెందిన బినామీ కాంట్రాక్టర్ రంగంలో దిగి, సైన్స్పార్క్ పూర్తిచేయడం చకచకా జరిగిపోయాయి. తొలుత రూ.1.2 కోట్లు అవుతుందని అంచనా వేయగా, చివరకు రూ. 1.45 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులను తీసుకొచ్చి మరీ సైన్స్పార్కుకు ఓపెనింగ్చేయించారు.
జిల్లా కేంద్రంలో ఉన్న జాగాలు వదిలి..
నారాయణపేట జిల్లా కేంద్రం కాకముందే పట్టణంతోపాటు శివార్లలో పెద్దసంఖ్యలో వెంచర్లు వెలిశాయి. కొందరు పక్కాగా డీటీసీపీ లేఅవుట్లతో పాటు మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకుని రూల్స్కు లోబడి ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. కొన్ని వెంచర్లలో ఇండ్లు కూడా నిర్మించారు. టౌన్నడుమ, టౌన్ను ఆనుకొని ఉన్న వెంచర్లలోనూ మున్సిపాలిటీకి 10శాతం గిఫ్ట్ చేసిన ఖాళీ జాగలున్నాయి. ద్వారక హిల్స్వెంచర్గా మార్చి మున్సిపాలిటీకి అరెకరం ఇచ్చారు. ఆర్టీసీ కాలనీ, బీసీ కాలనీ మధ్యలో రెడ్హిల్స్కాలనీలో ఎకరా వరకు మున్సిపాలిటీకి కేటాయించారు. ఆర్టీసీ బస్టాండ్ముందు ఆశోక్నగర్కాలనీ వెనుక చేసిన ఓ వెంచర్లో ఎకరాకు పైగా స్థలం మున్సిపాలిటీదే. ఇటు బస్టాండ్, అటు కొత్తగంజ్కు సమీపంలో ఉంటుంది. యాద్గిర్ రోడ్కు సమీపంలో హరిజన వాడ పక్కన అర ఎకరాఉంది. ఇవన్నీ విలువైన స్థలాలే. ఇటు ప్రజలకు, అటు చిన్న పిల్లలకు వాకబుల్డిస్టెన్స్లో ఉంటాయి. ఈ స్థలాల్లో ఎక్కడా సైన్స్పార్క్ కట్టాలనే ఆలోచన మున్సిపల్ఆఫీసర్లకు రాలేదు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న టీఆర్ఎస్లీడర్వెంచర్లో మాత్రం పార్కును కట్టి, తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
అవసరం లేని చోట కట్టిన్రు
పట్టణంలో జనాలకు దగ్గరగా పాత వెంచర్లు చాలా ఉన్నాయి. వాటిని కాదని ఊరిబయట కొత్త వెంచర్లో అంత కాస్ట్పెట్టి పార్క్ ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదు. మూడుసార్లు అంచనా విలువ పెంచారు. అలాగే వెంచర్లేఅవుట్లో ఉన్న స్థలంలో పార్క్ నిర్మించకుండా కొంచెం పక్కకు జరిపారు. ఇతర వెంచర్లలో కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.
- సత్యరఘుపాల్రెడ్డి, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, నారాయణపేట