ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
  • లేని వారు మ్యూచువల్‌‌‌‌‌‌‌‌  ఫండ్స్‌‌‌‌‌‌‌‌, స్టాక్‌‌‌‌‌‌‌‌ బ్రోకర్లతో పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకోవడం  అవ్వదు
  • సోషల్ మీడియా పోస్టులో పెట్టేటప్పుడు తమ రిజిస్ట్రేషన్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంటాక్ట్ డిటైల్స్‌‌‌‌‌‌‌‌ షేర్ చేయాల్సిందే
  • తప్పుడు సమాచారంతో ఇన్వెస్టర్లు మోసపోకుండా చర్యలు: సెబీ కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: రోజు రోజుకి పెరిగిపోతున్న  ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ల (ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్ల) ను కట్టడి చేసేందుకు   మార్కెట్ రెగ్యులేటరీ  కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రపోజ్ చేసింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు రూ.7.5 లక్షల వరకు ఫిన్‌‌‌‌‌‌‌‌ప్లుయెన్సర్లు వసూలు చేస్తున్నారు. వీరు చేసే పోస్టులతో ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్  ప్రజలకు మరింతగా అందుబాటులో ఉంటోంది. మరోవైపు  తప్పుడు ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ కట్టడి చేసేందుకు సెబీ  కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రపోజ్ చేసింది. వీటి ప్రకారం ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు సెబీ  దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.  రిజిస్ట్రేషన్ చేసుకోని  ఫిన్‌‌‌‌‌‌‌‌ప్లుయెన్సర్లు మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌, స్టాక్ బ్రోకర్స్‌‌‌‌‌‌‌‌తో టై అప్‌‌‌‌‌‌‌‌ అవ్వడాన్ని,  ప్రమోషనల్ యాక్టివిటీలలో  జాయిన్ కావడాన్ని నిషేధించింది. అంతేకాకుండా సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌లు లేదా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్ (ఆమ్ఫీ) దగ్గర రిజిస్టర్ చేసుకున్న ఫిన్‌‌‌‌‌‌‌‌ప్లుయెన్సర్లు సోషల్ మీడియాలో  సలహాలు ఇచ్చేటప్పుడు  తమ రిజిస్ట్రేషన్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ డిటైల్స్‌‌‌‌‌‌‌‌, ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌ అడ్రస్సల్‌‌‌‌‌‌‌‌ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌, అవసరమైన డిస్‌‌‌‌‌‌‌‌క్లోజర్స్‌‌‌‌‌‌‌‌, డిస్‌‌‌‌‌‌‌‌క్లయిమర్స్‌‌‌‌‌‌‌‌ను పోస్టుతో పాటు పెట్టాల్సి ఉంటుంది.    చాలా మంది ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు ప్రజలకు  ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ను పంచుతున్నారు.  మరోవైపు రిజిస్టర్ చేసుకోని వారు తప్పుడు సమాచారం లేదా ఒకరికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడం వంటివి చేస్తారనే ఆందోళనలూ ఎక్కువయ్యాయి.  కమీషన్‌‌‌‌‌‌‌‌ తీసుకొని పనిచేసే ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు ఏ ఒక స్టాక్ బ్రోకర్ లేదా మ్యూచువల్‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌ గురించి, కొన్ని షేర్ల గురించి బాగా చెప్పడం వంటివి చేస్తున్నారు.  

పోస్టుకు రూ.10 వేల నుంచి రూ.7.5 లక్షలు..

ఫిన్‌‌‌‌‌‌‌‌ప్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేందుకు రూ.10 వేల నుంచి రూ.7.5 లక్షలు వసూలు చేస్తున్నారని ఆనంద్ రాఠి వెల్త్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ సీఈఓ ఫెరోజ్‌‌‌‌‌‌‌‌ అజీజ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఒక క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌ కోసం ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ రూ.20 లక్షల వరకు, ప్లస్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు  వసూలు చేస్తోందని  వివరించారు. వీటికి అదనంగా రిఫరల్‌‌‌‌‌‌‌‌ ఫీజులు, ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేసినందుకు ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌లో షేరింగ్‌‌‌‌‌‌‌‌, సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి కాంపెన్సేషన్‌‌‌‌‌‌‌‌ పొందడం వంటి వివిధ మార్గాల ద్వారా అదనంగా సంపాదిస్తున్నారని  అజీజ్ అన్నారు. ఫిన్‌‌‌‌‌‌‌‌ప్లుయెన్సర్ల వలన వచ్చే రిస్క్‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు సెబీ కిందటి నెలలో ఒక  కన్సల్టేషన్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం కాలంలో ఫైనాన్షియల్ రికమండేషన్స్‌‌‌‌‌‌‌‌ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫైనాన్షియల్ సలహాల క్రెడిబిలిటీ తగ్గుతోంది. చాలా మంది ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు తప్పుడు సమాచారంతో  తమ ఫాలోవర్లను మోసం చేస్తుండడమే ఇందుకు కారణం. సెబీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసి, కొన్ని గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో కావాలని  చెబితే  ఫిన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లలో అకౌంటబిలిటీ పెరుగుతుందని వ్రైట్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోనమ్ శ్రీవాస్తవ అన్నారు. ‘ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లను కట్టడి చేయడానికి రెగ్యులేటరీ తీసుకుంటున్న చర్యలు కచ్చితంగా చాలా కీలకమైనవి. ఇన్వెస్టర్లను కాపాడుతాయి.  ఇండస్ట్రీలో పారదర్శకత పెరుగుతుంది’ అని ఆనంద్ రాఠీ అజీజ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. డిస్‌‌‌‌‌‌‌‌క్లోజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాలను సరిగ్గా ఫాలో అయ్యేందుకు సెబీ ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ, తాజాగా ప్రపోజ్ చేసిన చర్యలతో అకౌంటబిలిటీ పెరుగుతుందని, వీరు తమ  సలహాలకు బాధ్యత వహిస్తారని  ఫైర్స్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ తేజస్‌‌‌‌‌‌‌‌ ఖోడే పేర్కొన్నారు.