అయోధ్యలోని వివాదాస్పద రామాలయ నిర్మాణం అంశంపై సుప్రీం కోర్టులో నడుస్తున్న పిటిషన్ పై మళ్లీ ఇవాళ్టి(సోమవారం) నుంచి విచారణ ప్రారంభంకానుంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అయోధ్యలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. దసరా సెలవుల తర్వాత సోమవారం 38వ రోజు విచారణ ప్రారంభమవుతుంది. మధ్యవర్తిత్వం విఫలం కావడంతో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్టు 6 నుంచి కేసు విచారిస్తోంది. మధ్యలో దసరా సెలవులు రావడంతో కొన్నాళ్లు విచారణకు బ్రేక్ పడింది.
ఈనెల 16తో హిందూ వర్గాల వాదనలు ముగించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. మరుసటి రోజు ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అదే రోజు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ కూడా చేయనున్నారు. అతి సున్నితమైన ఈ కేసులో విచారణ చివరి దశకు చేరడం, తీర్పు వెలువడనుండడంతో ఆంక్షలు విధించామని, డిసెంబరు 10 వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు అధికారులు.